Rajya Sabha: రాజ్యసభలో నోట్ల కట్టల కలకలం.. విచారణకు ఆదేశించిన చైర్మన్ జగదీప్ ధంఖర్

by Shiva |   ( Updated:2024-12-06 06:20:27.0  )
Rajya Sabha: రాజ్యసభలో నోట్ల కట్టల కలకలం.. విచారణకు ఆదేశించిన చైర్మన్ జగదీప్ ధంఖర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ (Rajya Sabha)లో రూ.500 నోట్ల కట్టలు లభ్యమవడం కలకలం రేపుతోంది. కేంద్ర భద్రతా సిబ్బంది తనిఖీల్లో భాగంగా ఇవాళ ఉదయం రాజ్యసభ (Rajya Sabha)లో సెక్యూరిటీ సిబ్బందికి రూ.500 నోట్ల బండిల్ లభ్యమైంది. అయితే, ఆ డబ్బు ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ చైర్ వద్ద స్వాధీనం చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. ఈ మేరకు ఆ డబ్బు ఎవరిదో తేల్చాలంటూ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంఖర్ (Rajya Sabha Chairman Jagdeep Dhankhar) విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే చైర్మన్ నిర్ణయాన్ని విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే (Mallikarjuna Kharge) తప్పుబట్టారు. ఆ డబ్బలు ఎవరిదని విచారణ చేపట్టినప్పుడు ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ పేరును ప్రతిపాదించం ఎంత వరకు సంమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఇదే అశంపై రాజ్యసభలో వాడీవేడిగా చర్చ కొనసాగతోంది.

Next Story

Most Viewed