ప్రధాని నరేంద్ర మోడీకి పేదలు కనిపించరు: ప్రియాంక గాంధీ సంచలన కామెంట్స్

by Disha Web Desk 9 |
ప్రధాని నరేంద్ర మోడీకి పేదలు కనిపించరు: ప్రియాంక గాంధీ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు దూరమయ్యారని అన్నారు. ఆయనకు రైతులు, పేదలు కనిపించరని చెప్పుకొచ్చారు. అంతేకాదు నరేంద్ర మోడీ ప్రజలు దీనస్థితిలో ఉన్న ఎవరి ఇంటికి వెళ్లి పరామర్శించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఇందిరా గాంధీ ప్రజల గురించి ఆలోచించారని అన్నారు. తాను ప్రజల ఇళ్లకు వెళ్లి.. ప్రజల్ని కలిసి వారి బాధలను ఓపికగా వినేవారని తెలిపారు. ప్రజల అవసరాలు గుర్తించి తీర్చేవారని, వారు సేవే ధర్మంగా బతికేవారని పేర్కొన్నారు. మళ్లీ అలాంటి పవిత్రమైన రాజకీయాల్ని అందించి.. ప్రజల కోసం జవాబుదారీగా పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుందామని ప్రియాంక గాంధీ ప్రజల్ని కోరారు. దయచేసి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు వేసి ప్రజలు మోసపోవద్దని సూచించారు.

Next Story

Most Viewed