- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Amit Shah: నక్సలిజం నిర్మూలనలో మరో మైలురాయి- అమిత్ షా

దిశ, నేషనల్ బ్యూరో: నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలపై కేంద్రహోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 12 నుంచి ఆరుకు పరిమితమైనట్లు వెల్లడించారు. దీంతో, నక్సలిజాన్ని నిర్మూలించాలనే కార్యక్రమంలో మరో మైలురాయిని చేరుకున్నామన్నారు. దేశంలో మావోయిస్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించుకున్నారని.. ఇందులో భాగంగా సురక్షిత భారత్ను నిర్మించడానికి తాము కృషి చేస్తున్నామని అన్నారు. వచ్చే ఏడాది మార్చినాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతమొందిస్తామని నొక్కి చెప్పారు. ఇకపోతే, హోంమంత్రిత్వ శాఖ రూపొందించిన నివేదికల ప్రకారం.. దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 12 ఉన్నాయి. నివేదికల ప్రకారం.. 2015లో ఇవి 35 ఉండగా.. 2018 నాటికి 30కి తగ్గాయి. 2021 నాటికి 25కు వచ్చాయి. భద్రతా దళాలు చురుగ్గా చేపడుతున్న వరుస దాడుల వల్ల ఇవి 6కు చేరాయి.
మహిళా మావోయిస్టు హతం
మరోవైపు, బస్తర్ ప్రాంతంలో సోమవారం మరో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి చెందింది. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్గఢ్లో 135 మంది మావోయిస్టులు భద్రతా సిబ్బంది కాల్పుల్లో చనిపోయారు. ఇందులో 119 మంది ఒక్క బస్తర్ డివిజన్లోనే మరణించినట్లు అధికారులు తెలిపారు. గత శనివారం సుక్మా, బీజాపుర్లో జరిగిన రెండు ఘటనల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరో వైపు సోమవారం 50మంది మావోయిస్టులు తాము లొంగిపోతున్నట్లు ప్రకటించారు.