- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Breaking: 48 గంటల పాటు అతిభారీ వర్షాలు

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పూండి, చెంబరబాక్కం రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయాయి. జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. చెన్నై, మదురై,సేలం సహా 10 జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని తెలిపారు. మరో 48 గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. దీంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జలపాతాల వైపు పర్యాటకులకు అనుమతి నిషేధించారు.
వర్షాల నేపథ్యంలో ప్రజలకు అప్రమత్తత జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపారు. రోడ్లపై నీరు నిలిచిపోయే అవకాశం ఉండటంతో వాహనాలను స్లోగా డ్రైవర్ చేయాలని చెప్పారు. ప్రైవేటు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించారు. రైతులు పొలం పనులు వాయిదా వేసుకోవాలని, చెట్ల కిందకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.