HD Kumaraswamy : కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామికి అస్వస్థత

by Hajipasha |   ( Updated:2024-07-28 19:18:19.0  )
HD Kumaraswamy : కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామికి అస్వస్థత
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, జేడీఎస్ పార్టీ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి ఆదివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతుండగా అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా కుమారస్వామి ముక్కు నుంచి రక్తం కారింది. దీంతో ఆయన ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పార్టీ నేతలు ఆయనను బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం కుమారస్వామి ఆరోగ్యం స్థిరంగానే ఉంది.

బెంగళూరు నుంచి మైసూర్‌ వరకు జరిగే బీజేపీ-జేడీఎస్‌ పాదయాత్ర వచ్చే వారం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు కుమారస్వామి తెలియజేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన ముక్కు నుంచి రక్తం కారడం, చొక్కాపై రక్తపు మరకలు పడటంతో జేడీఎస్‌ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ఇందుకుగల కారణాలు తెలియరాలేదు. బీజేపీ, జేడీఎస్‌ కూటమి సమన్వయ కమిటీ ఆదివారం సమావేశమైంది. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టాలని ఇందులోనే నిర్ణయించారు.

Advertisement

Next Story