చిన్న పిల్లాడితో ఓటు వేయించిన బీజేపీ జిల్లా పంచాయితీ మెంబర్!.. (వీడియో వైరల్)

by Disha Web Desk 5 |
చిన్న పిల్లాడితో ఓటు వేయించిన బీజేపీ జిల్లా పంచాయితీ మెంబర్!.. (వీడియో వైరల్)
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో చిన్న పిల్లాడితో ఓటు వేయించిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బోపాల్ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో బీజేపీ జిల్లా పంచాయితీ మెంబర్ ఓ మైనర్ బాలుడితో ఓటు వేయించారు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఎలక్షన్ జరుగుతున్న సమయంలో ఓ మైనర్ బాలుడిని పోలింగ్ కేంద్రానికి తీసుకొని వెళ్లాడు. ఆ పిల్లాడికి కమలం గుర్తు ఉన్న బటన్ పై నొక్కమని చెబుతూ.. పిల్లాడితో బీజేపీకి ఓటు వేయించాడు. ఈ చర్యను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎన్నికల కమీషన్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. మైనర్ బాలుడిని పోలింగ్ బూత్ లోకి ఎలా అనుమతి ఇస్తారని, ఎలక్షన్ కమీషన్ నిద్ర పోతుందా? ఈ వీడియో ఎన్నికల కమీషన్ కు చేరలేదా? అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed