బోర్డర్ లో టూరిస్టుల మధ్య గొడవ.. భారత టూరిస్టులపై రాళ్లు విసిరిన బంగ్లాదేశీయులు

by Disha Web Desk 5 |
బోర్డర్ లో టూరిస్టుల మధ్య గొడవ.. భారత టూరిస్టులపై రాళ్లు విసిరిన బంగ్లాదేశీయులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియా- బంగ్లాదేశ్ టూరిస్టుల మధ్య గొడవ జరిగి ఇండియా టూరిస్టులపై రాళ్లు రువ్విన ఘటన రెండు దేశాల మధ్య బోర్డర్ లో జరిగింది. ఇండియా, బంగ్లాదేశ్ జాఫ్లాంగ్ బోర్డర్ లో ఉన్న ఓ హిల్ స్టేషన్ కు రెండు దేశాల ప్రజలు తరచూ వెళుతుంటారు. అలాగే పర్యాటక వీక్షణలో భాగంగా ఇండియా టూరిస్టులు కొందరు అక్కడికి వెళ్లగా.. అక్కడే ఉన్న కొందరు బంగ్లాదేశ్ టూరిస్టులలో ఓ ఐదుగురు ఆకతాయిలు మీకు ప్రవేశం లేదు ఎందుకు వస్తున్నారని అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించగా.. మరికొందరు బంగ్లాదేశ్ టూరిస్టులు అక్కడికి వచ్చి వారితో వాదించడం మొదలు పెట్టారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాధం పెరిగి బంగ్లాదేశ్ టూరిస్టులు ఇండియాకు వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ భారత పర్యాటకులపై రాళ్లు రువ్వడం మొదలు పెట్టారు. ఇండియన్ టూరిస్టులు అక్కడి నుంచి వెళ్లే వరకు అదే పనిగా రాళ్లు విసిరారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన భారతీయులు.. రాళ్లు విసరడం ఏంటని, కనీస భద్రత లేకుండా పోతోందని, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

Next Story

Most Viewed