90 కిలోల డ్రగ్స్‌తో పట్టుబడ్డ 14 మంది పాక్ జాతీయులు

by Disha Web Desk 12 |
90 కిలోల డ్రగ్స్‌తో పట్టుబడ్డ 14 మంది పాక్ జాతీయులు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ అధికారులు ఎన్నికల విధుల్లో నిమఘ్నం అయ్యారు. ఇదే అదునుగా చేసుకున్న పాక్ ఉగ్రవాదులు, పాకిస్థానీలు.. భారత్ లోకి డ్రగ్స్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పాక్ తో సరిహద్దులను పంచుకుంటున్న రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తరలించేందుకు ప్రతి రోజు ప్రయత్నిస్తునే ఉన్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ తీరంలో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలో 14 మంది పాకిస్థానీ పౌరులు పట్టుబడ్డారు. గుజరాత్ తీరంలో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలో 90 కిలోల డ్రగ్స్‌ తరలిస్తుండగా భారత తీర రక్షక దళం పట్టుకున్నట్లు భద్రతా అధికారులు తెలిపారు. దీంతో వారిపై కేసు నమోదు చేసిన అధికారులు.. కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed