- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మంగళగిరి జర్నలిస్టులకు నారా లోకేశ్ బీమా సౌకర్యం

X
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. దీనిపై గత వారం రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలోని 62 మంది జర్నలిస్టులకు ఉచిత బీమా సౌకర్యం ప్రకటించారు. సహజ మరణానికి 10 లక్షల రూపాయలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 20 లక్షల రూపాయల మేర లబ్ది పొందేలా బీమా సౌకర్యం కల్పించారు. కరోనా మరణాలకు కూడా బీమా వర్తింపజేసేలా తీసుకువచ్చిన ఈ పాలసీలకు ప్రీమియంను నారా లోకేశ్ చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ప్రభుత్వం బీమా చేయించాలని డిమాండ్ చేశారు. కరోనాతో మరణించిన జర్నలిస్టులకు కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన సూచించారు.
Next Story