The Mystery of Moksha Island: క్యూరియాసిటీ పెంచుతున్న ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్..’

by sudharani |
The Mystery of Moksha Island: క్యూరియాసిటీ పెంచుతున్న ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్..’
X

దిశ, సినిమా: అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మడివాడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్’. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌కు అనిష్ యెహాన్ కురువిల్లా దర్శకత్వం వహిస్తున్నాడు. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు రాబోతున్న ఈ సిరీస్ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో చూస్తే.. ‘నికోబార్ ఐల్యాండ్స్‌లో ఉన్న ప్రైవేట్ ఐల్యాండ్ మోక్షను విజిట్ చేసేందుకు వెళ్తారు ఆ ఐల్యాండ్ వారసులు. మోక్ష ఐల్యాండ్‌లోని ప్రతి జీవాన్ని, ప్రతి మార్గాన్ని డాక్టర్ విశ్వక్ సేన్ సృష్టిస్తాడు. అతనికి ప్రతిబింబం లాంటిదే ఈ ఐల్యాండ్. అలాంటి దీవిలోకి అడుగుపెట్టిన వారసులకు అనూహ్యమైన ఘటనలు ఎదురవుతుంటాయి. ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. వీరి హత్యలకు కారణం ఏంటి? అందమైన మోక్ష దీవిలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎవరు సృష్టిస్తున్నారు? వారసులనే ఎందుకు టార్గెట్ చేశారు? అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది’. టైటిల్‌కు తగ్గట్టుగా ట్రైలర్ కూడా ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్’ సిరీస్‌పై మరింత క్యూరియాసిటీని పెంచేవిధంగా ఉండగా.. ప్రజెంట్ ఇది నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story