- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పెళ్లి కాకుండానే గుడ్ న్యూస్ చెప్పిన శోభాశెట్టి.. ఎట్టకేలకు కల నేరవేరిందంటూ పోస్ట్
దిశ, సినిమా: బుల్లితెర నటి శోభాశెట్టి ‘కార్తీక దీపం’ సీరియల్లో నటించి ఓవర్ నైట్ స్టార్గా మారిపోయింది. ఇందులో ఆమె విలన్ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది. అలాగే పలు సీరియల్స్ చేసి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా తెలుగు రియాలిటీ షో బిగ్బాస్లో కంటెస్టెంట్గా పాల్గొని.. తన ఆటతీరుతో పురుషులకు పోటీగా నిలిచింది.
ముందు పలు ఎపిసోడ్స్ అన్నింటిలో సంచాలక్గా వ్యవహరించింది. చివరిగా టాక్స్ల్లో పాల్గొన్నప్పటికీ కప్ గెలుచుకోలేకపోయింది. అయితే శోభాశెట్టి బిగ్బాస్లో ఉండగానే తన బాయ్ఫ్రెండ్ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. కార్తీక దీపం సీరియల్ నటుడు యశ్వంత్ రెడ్డితో ప్రేమలో ఉన్నట్లు తొందరలో పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు తెలిపింది.ఇక ఇంటి నుంచి బయటకు వచ్చాక పూర్తిగా నటనకు గుడ్ బై చెప్పేసి బాయ్ఫ్రెండ్తో పలు యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తూ వెకేషన్స్కు వెళుతుంది. కానీ పెళ్లి డేట్ మాత్రం ప్రకటించలేదు.
ఈ క్రమంలో.. తాజాగా, శోభాశెట్టి ఓ గుడ్ న్యూస్ తెలిపింది. కొత్త ఇంటిని కొనుగోలు చేసి ప్రియుడితో పాటు గృహప్రవేశం చేసింది. ఈ వేడుకకు బిగ్బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ వచ్చారు. ఇన్స్టా వేదికగా సొంత ఇంటి కల నేరవేరిందంటూ రాసుకొచ్చిన ఆట సందీప్ పెట్టిన పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం శోభాశెట్టి గృహ ప్రవేశానికి సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో అవి చూసిన నెటిజన్లు పెళ్లి కాకుండానే కాపురం పెట్టేసిందని నెట్టింట చర్చించుకుంటున్నారు.