‘బ్రో ది అవతార్’ ప్రీ రిలీజ్.. పవన్ కోసం అక్కడ ప్లాన్ చేశారట

by Prasanna |
‘బ్రో ది అవతార్’ ప్రీ రిలీజ్.. పవన్ కోసం అక్కడ ప్లాన్ చేశారట
X

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ఎంటర్టైనర్ మూవీ ‘బ్రో ది అవతార్’. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి అప్‌డేట్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రాజమండ్రిలో నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ రాజమండ్రి వైపు వారాహి యాత్రలో ఉన్నాడు. అందుకే ఈవెంట్‌ను అక్కడే ప్లాన్ చేయనుందట మూవీ టీమ్.

Also Read: జిమ్‌లో చెమటోడ్చుతున్న పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ (వీడియో)

Advertisement

Next Story

Most Viewed