NTR: తమిళనాడులో యంగ్ టైగర్ కి నచ్చే బిర్యానీ .. అది మిస్ అయిపోద్ది నేను పారుగెత్తాలంటూ ఎన్టీఆర్ కామెంట్స్

by Prasanna |
NTR: తమిళనాడులో యంగ్ టైగర్ కి నచ్చే బిర్యానీ .. అది మిస్ అయిపోద్ది నేను పారుగెత్తాలంటూ ఎన్టీఆర్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ లో బిజీగా ఉంటున్నాడు. ఈ మూవీ దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 27 న విడుదల కానుంది. ఎన్టీఆర్ ఫుడ్ లవర్ అని మనందరికీ తెలిసిందే. సినిమా ఇంటర్వ్యూ ల్లో కూడా ఎన్నో సార్లు ఫుడ్ గురించి చెప్పాడు. ఇక ఎన్టీఆర్ కి దగ్గరగా ఉండే సన్నిహితులు కూడా ఎన్టీఆర్ ఒకసారి తినడం మొదలు పెడితే ఇక ఆపడాలు ఉండవని పలుమార్లు తెలిపారు. ఫుడ్స్ లో నాటుకోడి కీమా , చికెన్ బిర్యానీ ఇష్టంగా తింటాడని ఓ ఇంటర్వ్యూలో కూడా తెలిపాడు. తాజాగా దేవర ప్రెస్ మీట్ లో మరోసారి ఎన్టీఆర్ ఫుడ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

దేవర ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ చెన్నై వెళ్లినా విషయం తెలిసిందే. అక్కడ యాంకర్ గ్యాప్ లేకుండా ప్రశ్నలు అడుగుతుండటంతో ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ చేసారు. ప్రెస్ మీట్ లో యంగ్ టైగర్ మాట్లాడుతూ.. " మీరు నేను అనుకున్న ప్లాన్ ని మొత్తం నాశనం చేస్తున్నారు. నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు దిండిగల్ తలప్పకట్టి బిర్యానీ ప్యాక్ తీసుకుని వెళ్దాం అనుకున్నాను. ఇక్కడ లేట్ అయితే దాని కోసం నేను పరిగెత్తాలి..మళ్ళీ అది మిస్ అయిపోద్దేమో.. దేవర మూవీ విడుదలైన తర్వాత ఇక్కడికి వచ్చాక మన ఇద్దరం వెళ్లి తిందాం అంటూ" యాంకర్ తో సరదాగా మాట్లాడారు. అంటే తమిళనాడులో యంగ్ టైగర్ కి నచ్చే బిర్యానీ ఇదే అంటూ ఇండైరెక్ట్ గా ప్రెస్ మీట్ లో తెలిపారు.

Read More..

NTR: నాతో సినిమా చేయండి ప్లీజ్ అంటూ.. ఆ డైరెక్టర్ ను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్

Advertisement

Next Story

Most Viewed