‘ఆ తీశావ్‌ లే బోడీ సినిమా’.. ఆ హీరో ముందే రాజమౌళిపై కీరవాణి భార్య ఫైర్‌

by Kavitha |
‘ఆ తీశావ్‌ లే బోడీ సినిమా’.. ఆ హీరో ముందే రాజమౌళిపై కీరవాణి భార్య ఫైర్‌
X

దిశ, సినిమా: దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తనకంటూ స్పెషల్ ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు మాక్సిమమ్ అన్ని బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. ఆయన తీసిన ఈగ, బాహుబలి 1,2 చిత్రాలు పాన్ ఇండియా లెవల్లో దుమ్ముదులిపితే త్రిబుల్ ఆర్ ఏకంగా ఆస్కార్ తీసుకొచ్చి పెట్టింది. ఆర్ఆర్ఆర్ మూవీకి ఆయన అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఇలా స్కేల్‌ పరంగా, కలెక్షన్ల పరంగానూ కొత్త పుంతలు తొక్కించిన డైరెక్టర్ రాజమౌళిపై కీరవాణి భార్య ఫైర్‌ కావడం ఇప్పుడు నెట్టింట షాకిస్తుంది.


అసలు మ్యాటర్ లోకి వెళితే.. `బాహుబలి 2` సినిమా విడుదలై విశేష ఆదరణ పొందుతున్న సమయంలో రాజమౌళి తన ఫ్యామిలీతో భళ్లారిలోని తన ఇంట్లో ఉన్నారు. ఇక లంచ్‌ చేసేందుకు అందరూ కూర్చున్నారు. ఆ సమయంలో హీరో నాని కూడా రాజమౌళి ఇంటికి వెళ్లాడు. అయితే అందరూ కూర్చున్న టైంలో రాజమౌళి ఉండి, మళ్లీ పక్కన ఉన్న థియేటర్‌కి సినిమా చూడటానికి వెళ్దామా అని క్యాజ్వల్‌గా తన ఫ్యామిలీ మెంబర్స్‌తో అన్నాడు. అలా రాజమౌళి అనడంతో మండిపోయిన వల్లీ(కీరవాణి వైఫ్ శ్రీవల్లి) ‘ఆ తీశావ్‌ లే బోడీ సినిమా’. దాన్ని మళ్లీ చూస్తామా అన్నదట. ఇది విన్న హీరో నానికి ఫ్యూజులు ఎగిరిపోయాయట. అదేంటి అంత మాట అనిందని రాజమౌళి గారిని అడిగితే ఇలాంటి మనుషులు ఫ్యామిలీలో ఉంటే ఎంత సాధించినా డౌన్‌ టూ ఎర్త్ ఉండొచ్చు అని కామెంట్‌ చేశాడట. అయితే సింహ హీరోగా నటించిన ఓ సినిమా ఈవెంట్‌కి గెస్ట్ గా వెళ్ళిన నాని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.



Next Story