- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సిద్ధార్థ్, అదితి ఆ ఆలయంలో పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా?
దిశ, సినిమా : టాలీవుడ్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి సీక్రెట్గా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరు గత కొన్ని రోజుల నుంచి లవ్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాను షేక్ చేసాయి. వాటన్నింటికి చెక్ పెడుతూ, వీరు శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో బుధవారం చాలా గోప్యంగా, తన కుటుంబ సభ్యుల మధ్య మూడు ముళ్లతో ఒకటయ్యారు.
అయితే వీరు వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి ఆలయంలో ఒక్కటి అయ్యారు. దీంతో ఆలయం గురించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. ఈ ఆలయం దాదాపు 500 ఏళ్ల క్రితం నిర్మించారంట. వనపర్తి సంస్థానాధీశుడు బహిరి అష్టబాషి గోపాలరావు 15వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని కట్టించారు. పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన ఆయన, శ్రీరంగనాథుడి ఆలయం, స్వామి వారిని చూసి ఎంతో పొంగిపోయాడు. తన భక్తితో ఆ గుడికి ఎప్పుడూ వెళ్తూ పూజలు చేసేవాడు. ఇక ఆయన భక్తికి ముగ్ధుడైన రంగనాథ స్వామి సంకిరెడ్డిపల్లి గ్రామ అడవిలో ఉన్న పుట్టలో కొలవుదీరినట్లు రాజుగారికి చెప్పాడు. దీంతో స్వామి వారు ఆలయాన్ని నిర్మించి, బ్రహ్మోత్సవాలు జరిపిస్తున్నారు. ఇంత ప్రత్యేకత ఉండటంతో సిద్ధార్థ్, అదితిరావులు శ్రీరంగాపూర్లని ఆలయంలో వివాహం చేసుకున్నారంట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.