ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు :సీతక్క

by  |
ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు :సీతక్క
X

దిశ, వెబ్‎డెస్క్: అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాట్లాడకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. జీరో అవర్, క్వశ్చన్ అవర్, స్వల్పకాలిక చర్చ లేదంటూ.. డబ్బా కొట్టుకోవడంతో సరిపోతుందని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతా బాగుంటే సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు.

లాక్‎డౌన్ సమయంలో కరోనా ప్రభావం అనేక రంగాలపై పడిందని.. వారందరినీ ఆదుకోవాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎదుట ఆత్మాహుతికి పాల్పడ్డ తెలంగాణ నాగులు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. బండ్లగూడలో తెలంగాణ నాగులు ఇంటికి వెళ్లినప్పుడు.. ఆయన మృతదేహంపై టీఆర్ఎస్ కండువా కప్పారని అన్నారు. టీఆర్ఎస్ నేతలు కనీసం నివాళులు అర్పించకపోవడం బాధాకరమన్నారు.

Read Also..

ఎమ్మెల్యే జాఫర్‌కు పాజిటివ్..


Next Story

Most Viewed