ఆ ఆలయ పునర్నిర్మాణం ఓ చరిత్ర

by Shyam |
ఆ ఆలయ పునర్నిర్మాణం ఓ చరిత్ర
X

దిశ, ఆలేరు: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంతో చరిత్ర సృష్టించామని నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని అనంతరం ప్రధాన ఆలయ పునర్నిర్మాణం పనులను తనిఖీ చేశారు. .ఇప్పటికే ప్రసిద్ధిగాంచిన యాదాద్రి ఆలయాన్ని రానున్న రోజుల్లో లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉందన్నారు. యాదాద్రి ఆలయం హైదరాబాద్‌కు సమీపంలోనే ఉండటంతో శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని భూపాల్ రెడ్డి అన్నారు.



Next Story