- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆమనగల్ మండలంలో చిరుత దాడి

X
దిశ, కల్వకుర్తి: లాక్డౌన్ సమయంలో జనారణ్యంలోకి పులులు వచ్చి హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా పలు ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నే ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమన్గల్ మండల పరిధిలో ఓ చిరుత పులి కలకలం రేపుతోంది. రాంనుంతల గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలో బర్రె దూడను కట్టేసి ఇంటికి వెళ్లాడు. గురువారం తెల్లవారుజామున దూడకు మేత వేయడానికి వెళ్లే సరికి చిరుత పులి దాడిలో ఆ దూడ మృతి చెందింది. పులి భయంతో ఇతర రైతులు కూడా పంట పొలాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు.
Next Story