- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడే ఆటగాళ్లు ఎవరూ కరోనాకు భయపడరని, ఒకరిద్దరి కోసం లీగ్ మొత్తాన్ని రద్దు చేయలేరని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Gowtham gambir) అన్నారు. యూఏఈలో ఉన్న ఆటగాళ్లందరూ కచ్చితమైన నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన గంభీర్.. ‘ఐపీఎల్లో ఆడుతున్న క్రికెటర్లు BCCI నిర్థేశించిన నిబంధనలు తప్పకుండా పాటించాలి. బయోసెక్యూర్ వాతావరణంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ ఒక్కరి కోసమే టోర్నీని రద్దు చేయలేరు.
నాకు తెలిసి ఐపీఎల్ ఆడుతున్న ఆటగాళ్లు ఎవరూ కరోనా(COVID-19)కు భయపడరు. అందరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. టీం ఇండియా ఆటగాళ్లు చాలా కాలంగా క్రికెట్కు దూరమయ్యారు. కాబట్టి ఐపీఎల్ ద్వారా వాళ్లు ఫామ్లో ఉన్నారా లేదా ఫామ్ కోల్పోయారా అనే విషయాలు సీజన్ ప్రారంభమయ్యాక తెలుస్తుంది.’ అని అన్నారు. ఇక యువరాజ్ తిరిగి క్రికెట్ ఆడాలను కోవడంపై స్పందించిన గంభీర్.. అతడు పంజాబ్ తరపున ఆడాలనకుంటే ఆడొచ్చు. ఒక క్రికెటర్ను ఆడటం ప్రారంభించు, ముగించు అని మనం బలవంతం చేయలేమని అన్నాడు.
Read Also…