కిల్లర్ PUB-JI

by  |
కిల్లర్ PUB-JI
X

దిశ, వెబ్‌డెస్క్: పబ్జీ గేమ్ (Pub-ji)కు బానిసై చాలా మంది యువత తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. కొందరు గేమ్ ఆడేందుకు కొత్త మొబైల్ కొనివ్వాలని, మరికొందరు గేమ్‌లో ఓడిపోయామని, ఆట మధ్యలో 'ఫ్రీ ఫైర్' ఇవ్వలేదని ఇలా సిల్లీ రిజన్స్‌కు తమ నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నారు. తాజా కేంద్రం పబ్జీ బ్యాన్ చేయడంతో దాని అడిక్ట్ అయిన వారు వింతగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. నిద్రలో కూడా గేమ్ ఆడుతున్నట్లు ప్రవర్తిస్తున్నారని వెల్లడైంది.ఈ నేపథ్యంలో పబ్జీకి బానిసై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా రెవెన్యూ కాలనీలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. కిరణ్ కుమార్ రెడ్డి అనే యువకుడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు. రోజువారీగా పబ్జీ ఆడుతూ దానికి బానిసయ్యాడు. ఇంట్లోవారు ఎన్నిమార్లు మందలించిన వినిపించుకునే వాడు. ఈ క్రమంలోనే ఎవరూలేని సమయం చూసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also..

ఇంట్లోకి దూసుకెళ్లిన వోల్వో బస్సు..



Next Story

Most Viewed