జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదం : యనమల

by srinivas |
జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదం : యనమల
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైఎస్ఆర్ జలకళ పథకం మరో మాయాజాలం అని విమర్శించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టి, రూ.4 వేల కోట్లు ఎగ్గొట్టడం ద్రోహం అన్నారు. వైఎస్ఆర్ జలకళ పేరుతో రూ. 2 లక్షల బోర్లు వేస్తామనడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాలపై దాడులు, విగ్రహాలు మాయం కావడం వంటి అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నారని విమర్శించారు.

Next Story

Most Viewed