తొమ్మిది హత్యల కేసులో నేడు తుది తీర్పు

by Sumithra |   ( Updated:2020-10-28 04:15:46.0  )
తొమ్మిది హత్యల కేసులో నేడు తుది తీర్పు
X

దిశ, వెబ్‎డెస్క్ :
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తొమ్మిది హత్యల కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. నిందితుడికి ఉరిశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే 21వ తేదీన వరంగల్ నగర శివారులోని గొర్రెకుంట సాయి దత్త గన్ని బ్యాగ్స్ కంపెనీలో నిందితుడు తొమ్మిది మందికి మత్తు ఇచ్చి సృహ కోల్పోయిన తర్వాత సజీవంగా బావిలో పడేసి హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడు బీహార్‌కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్‌కు సెషన్స్ కోర్టు బుధవారం శిక్షను ఖరారు చేయనుంది. నిందితుడి పై 7సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. నెల రోజుల్లోనే కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

Next Story

Most Viewed