- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
by D.Reddy |

X
దిశ, వెబ్ డెస్క్: వరుస సెలవులు వస్తుండటంతో గత కొన్ని రోజులుగా ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్ర తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం కూడా భక్తులు శ్రీవారి దర్శనం కోసం భారీగా వేచి చూస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 5 గంటలకు పైగానే సమయం పడుతుంది. రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. ఇక నిన్న స్వామివారిని 65,487 మంది భక్తులు దర్శించుకోగా, 23,909 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.75 కోట్లుగా ఉంది.
Next Story