- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఉగ్రదాడి నేపథ్యంలో కీలక పరిణామం.. రైల్వే ట్రాక్ బోల్ట్లు తొలగించిన దుండగులు

దిశ, వెబ్డెస్క్: పహల్గాం (Pahalgam) ఉగ్రదాడిలో నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం (Central Intelligence Agency) అన్ని రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చాలని ఇప్పటికే సూచించారు. ఈ నేపథ్యంలో చెన్నై (Chennai)లోని అరకోణం (Arakonam)లో జరిగిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. గురువారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు రైల్వే ట్రాక్ బోల్ట్లను తొలగించారు. అయితే, రైల్వే అధికారుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఆ ట్రాక్పై ప్రయాణించే పలు రైళ్లను బెంగళూరు, కేరళ వైపు మళ్లించారు. ఈ నేపథ్యంలోనే పలు ట్రైన్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆకతాయిలు ఈ దుర్చర్యకు పాల్పడ్డారా లేక ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఏమైనా ఉందా అన్న కోణంలో అక్కడ లభించిన సీసీ టీవీ ఫుటేజీ అధారంగా విచారణను ముమ్మరం చేశారు.