కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

by  |
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
X

దిశ, వెబ్‎డెస్క్: కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం అందించాలని తెలంగాణ స్టేట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్‌ (టీఎస్ఎస్‎వో) రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రదాన గ్రామంలో కరోనా బాధితులకు సోమవారం టీఎస్‌ఎస్‌వో ద్వారా బియ్యం, నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఎస్.సుధాకర్, టీఎస్ఎస్‎వో నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనివాస్ మాట్లాడుతూ.. మనోధైర్యమే కరోనాకు అసలైన మందు అని.. భయం వీడితేనే వైరస్ పోతుందన్నారు.

Read Also…

వ్యాక్సిన్ అందరికీ అందాలంటే మరో నాలుగేళ్లు..!


Next Story

Most Viewed