ఒడిశా టు మహారాష్ట్ర వయా తొర్రూరు..

by Sridhar Babu |
ఒడిశా టు మహారాష్ట్ర వయా తొర్రూరు..
X

దిశ,దేవరుప్పుల : తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ ఉపేందర్ తెలిపిన వివ రాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఒడిశా రాష్ట్రం నుండి మహారాష్ట్ర కు తొర్రూరు మీదుగా 9.5 కిలోల గంజాయి తరలిస్తుండగా సమాచారం అందుకున్న ఎస్ఐ తమ సిబ్బందితో బస్ స్టాండ్ కి చేరుకొని తనిఖీ చేయగా ఇద్దరి వద్ద గంజాయి లభించింది. దాంతో వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Next Story

Most Viewed