కేంద్రంపై సీపీఐ రామకృష్ణ ఫైర్

by srinivas |
CPI Leader Ramakrishna
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీజేపీలో అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ కంపెనీల కొమ్ముకాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కార్మికుల హక్కులు కాలరాస్తోందని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ… నవంబర్ 26,27న దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు ఇవ్వాల్సిన రుణాలు కార్పొరేట్లకు ఇస్తున్నారని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed