ఎల్ఆర్ఎస్‎పై కాంగ్రెస్ ఎంపీ పిటిషన్ దాఖలు..!

by  |
ఎల్ఆర్ఎస్‎పై కాంగ్రెస్ ఎంపీ పిటిషన్ దాఖలు..!
X

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో సంచలనంగా మారిన ఎల్ఆర్ఎస్‎పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‎రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎల్ఆర్ఎస్ ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడతారని పిటిషన్‎లో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‎రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో చట్టవిరుద్ధమైన లేఅవుట్లను నిరోధించడానికి ప్రభుత్వం నియమ, నిబంధనలను జారీ చేసింది. కానీ, పేద, మధ్య తరగతి ప్రజలు వారి తప్పు లేకున్న భారీ జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అనుమతులు లేని వెంచర్లపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుందన్నారు. అధికారులు పాటించని తప్పుకు సామాన్య ప్రజలపై భారీ జరిమానా విధించడం సరికాదన్నారు. సామాన్యులు ఎప్పుడో కొన్న ప్లాట్ యొక్క కొనుగోలు ధరలో దాదాపు సగం మళ్లీ కట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also..

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి


Next Story

Most Viewed