వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

by srinivas |
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రాలో వరదలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. వీటి దెబ్బకు ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం జగన్‌ పరిశీలించారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ అధికారులతో కలిసి శనివారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

ఎంత ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం ఎంత, అక్కడి ప్రజల పరిస్థితి ఏంటి, వారి ఆరోగ్యం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం సీఎం జగన్‌ తాడేపల్లికి తిరుగు పయనమయ్యారు.

Next Story

Most Viewed