- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Venu Swamy: బిగ్ బాంబ్ పేల్చిన వేణు స్వామి.. బన్నీ, సుకుమార్కు విపరీతమైన సమస్యలు వస్తాయంటూ సంచలన పోస్ట్ (వీడియో)

దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి(Venuswamy) సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెప్తూ ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల శోభిత, నాగచైతన్య(Naga Chaitanya) రెండో పెళ్లిపై మాట్లాడిన మాటలు ఎంతలా సెన్సేషన్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహిళా కమిషన్ సీరియస్ కావడంతో క్షమాపణలు కూడా చెప్తారు. ఇక నుంచి అయినా ఆయన సైలెంట్గా ఉంటారని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, మరోసారి వేణుస్వామి తన ఇన్స్టాగ్రామ్(Instagram) పోస్ట్తో నెట్టింట సంచలనం సృష్టిస్తున్నారు. ఐటీ రైడ్స్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘అల్లు అర్జున్(Allu Arjun) గురించి ఆయన చుట్టూ జరిగే వాటి గురించి అందరూ విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ఇన్కం ట్యాక్స్ రైడ్స్కు సంబంధించి చాలా మంది అడుగుతున్నారు. అల్లు అర్జున్ది కన్యారాశి, సుకుమార్ది కుంభ రాశి. వాళ్ళ జాతకాలు షష్టాష్టకం కాంబినేషన్ జాతకంలో శని స్థానం బట్టి సంఘటనలు జరుగుతాయి. ఈ రెండు కలవడం వల్ల ఒక ఫైర్ లాగా బ్లాస్ట్ అవుతుంది. దీని వల్ల చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. అల్లు అర్జున్ జాతకం ప్రకారం.. ఇప్పుడు ఉన్న శని స్థానం ప్రకారం ఆయనకు శత్రు స్థానం, రోగ స్థానం ఉన్నాయి. గత సంవత్సరం నుంచి ఆయన మీద విపరీతమైన శత్రువుల దాడి జరుగుతుంది. వీటివల్ల, జైలుకు వెళ్లడం వల్ల మానసికంగా బాగా దెబ్బ తిన్నారు. వీటితో పాటు ఓ సంచలనం సృష్టిస్తారు.
అదే పుష్ప 2 సినిమా. 2025 మార్చి 30 వరకు అల్లు అర్జున్, సుకుమార్లకు శని కీలక స్థానాల్లో ఉండటం వల్ల పెను సంచలనాలు, వీపరీతమైన సమస్యలు వస్తాయి. వాళ్ల వల్ల మైత్రి మూవీస్(Mythri Movies) వాళ్ళు, దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) ఎఫెక్ట్ అయ్యారు. మార్చి 30 తర్వాత ఇంకా పైకి ఎదుగుతారు. ఉగాది నుండి శని తులారాశి లోకి వెళ్లడం వల్ల తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు రాజకీయాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు సినిమా టైటిల్స్, ట్రైలర్ మాత్రమే పడ్డాయి. అసలైన సినిమా ముందుంది. ఇలాంటివి మార్చి 30 నుంచి మరిన్ని చూడబోతున్నాము’’ అని చెప్పుకొచ్చారు.