Allu Arjun: మేనల్లుడిని చూసి కన్నీరు పెట్టుకున్న చిరంజీవి సతీమణి

by Kavitha |
Allu Arjun: మేనల్లుడిని చూసి కన్నీరు పెట్టుకున్న చిరంజీవి సతీమణి
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఇంటికి వచ్చిన బన్నీని పరామర్శించడానికి సినీ ప్రముఖులు క్యూ కట్టారు. ఇందులో భాగంగా, హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సుకుమార్, దిల్‌రాజు, వంశి పైడిపల్లి, కొరటాల శివ, రాఘవేంద్రరావు, హీరో శ్రీకాంత్‌లు అల్లు అర్జున్‌ని కలిసి పరామర్శించారు. ఈ క్రమంలో చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ కూడా త‌న మేన‌ల్లుడు బన్నీ నివాసానికి వెళ్లారు. అక్కడ ఐకాన్ స్టార్‌ని చూడగానే ఆమె భావోద్వేగానికి గుర‌య్యారు. అలాగే తాజా ప‌రిణామాల గురించి మాట్లాడి ప‌రామ‌ర్శించారు. బ‌న్నీని హ‌త్తుకుని ధైర్యం చెప్పారు. కాగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తనకు తోడుగా ఉన్న వారికి ధన్యవాదాలు చెప్తూ.. మృతి చెందిన మహిళ కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. అలాగే ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed