తక్కువ లాభాలతో సరిపెట్టిన సూచీలు!

by Harish |
తక్కువ లాభాలతో సరిపెట్టిన సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. మంగళవారం ట్రేడింగ్‌లో ఉదయం నుంచే ఊగిసలాటకు గురైన సూచీలు మిడ్-సెషన్ వరకు నష్టాల్లో కదలాడాయి. ఆ తర్వాత లాభనష్టాల మధ్య ర్యాలీ చేసిన తర్వాత చివరికి అత్యల్ప లాభంతో ముగిశాయి.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు స్తబ్దుగా మారాయి. చివరి గంటలో కొంతసేపు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాల నుంచి బయటపడ్డాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 5.41 పాయింట్లు లాభపడి 62,792 వద్ద, నిఫ్టీ 5.15 పాయింట్లు పెరిగి 18,599 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, రియల్టీ, ఫార్మా, హేల్త్‌కేర్ రంగాలు రాణించాయి. ఐటీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాలు జరిగాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో అల్ట్రా సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతీ సుజుకి, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఇన్ఫొసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, విప్రో, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.61 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed