కొత్త ట్రాక్టర్లను విడుదల చేసిన మహీంద్రా!

by Harish |
కొత్త ట్రాక్టర్లను విడుదల చేసిన మహీంద్రా!
X

న్యూఢిల్లీ: దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ప్రాంతాలకు విస్తరించే లక్ష్యంలో భాగంగా చిన్న-సైజ్ ట్రాక్టర్లను విడుదల చేసింది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు హామీగా ఈ కొత్త లైట్‌వెయిట్ ట్రాక్టర్లను తీసుకొచ్చామని, ఓజా ప్లాట్‌ఫామ్‌పై వీటిని ఆవిష్కరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. వాటిలో ఓజా 2127 మోడల్ ధర రూ. 5.64 లక్షలు ఉండగా, ఓజా 3140 మోడల్ రూ. 7.35 లక్షలుగా నిర్ణయించారు. దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతుల అవసరాలను తీర్చే లక్ష్యంతో వీటిని అందుబాటులోకి తెచ్చినట్టు కంపెనీ వెల్లడించింది.

ఈ ట్రాక్టర్ల డెలివరీలను ఈ ఏడాది అక్టోబర్ నుంచి, గ్లోబల్ మార్కెట్లలో 2024, జనవరి నుంచి డెలివరీలు అందించనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. ఓజా ప్లాట్‌ఫామ్‌పై మహీంద్రా ఇంజనీరింగ్ టీమ్, మహీంద్రా ఏఎఫ్ఎస్ ఆర్అండ్‌డీ, జపాన్‌కు చెందిన మిత్సుబిషి కంపెనీల సహకారంతో ట్రాక్టర్ మోడళ్లను అభివృద్ధి చేశారు. ఈ సంయుక్త ప్రాజెక్టు కోసం రూ. 1,200 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు మహీంద్రా వివరించింది.

Next Story

Most Viewed