సీఎం కుమారుడిపై కంగనా ఫైర్

by  |
సీఎం కుమారుడిపై కంగనా ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ కేసులో చిక్కుకుని, మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బాలీవుడ్ యువ నటీ కంగనా రనౌత్ మరోసారి శివసేన పార్టీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఏకంగా సీఎం ఉద్ధవ్ థాకరే కుమారుడు, మంత్రి ఆదిత్య థాక్రేపై తీవ్ర విమర్శలు చేశారు. బాలీవుడ్‌ డ్రగ్స్‌ రాకెట్‌తో ఆదిత్య థాక్రేకు సంబంధాలు ఉన్నాయని కంగనా ఆరోపణలు గుప్పించారు. డ్రగ్స్‌ మాఫియాను ఎదిరించినందుకే తనపై మహారాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టిందని తెలిపారు. ఇది వరకు ముంబై నగరం సురక్షితమని అనిపించేదని చెప్పిన కంగనా ముంబైలో తనను భయోత్పాతానికి గురి చేశారని శివసేనపై నిప్పులు చెరిగారు.

Read Also…

ఇంట్రెస్టింగ్‌గా అక్షర ఫస్ట్ లుక్..


Next Story

Most Viewed