Annamayya District: గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యాయత్నం

by srinivas |
Annamayya District: గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా కురబల కోట మండలం ముదివేడు గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆత్మహత్యాయత్నం కలకలం రేగింది. పాఠశాలకు చెందిన ముగ్గురు 9వ తరగతి విద్యార్థులు మోతాదుకు మించి మందులు మిగారు. దీంతో విద్యార్థులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కిందపడి ఉన్న విద్యార్థులను గమనించిన పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆత్మహత్యాయత్నానికి కారణాలను తెలుసుకోవాలని అధికారులకు సూచించారు



Next Story