చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కావడంపై YCP సంచలన నిర్ణయం

by Satheesh |
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కావడంపై YCP సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి సమయం ఆసన్నమైంది. బుధవారం 11.27 నిమిషాలకు నాలుగో సారి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, బండి సంజయ్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, స్టార్ హీరోలు చిరంజీవి, రజినీకాంత్‌లు హాజరవుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రమాఖ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావడంపై ప్రతిపక్ష వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమానికి హాజరు కావొద్దని వైసీపీ డెసిషన్ తీసుకుంది.

కాగా, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 సీట్లలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. అధికార వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమై ఘోర ఓటమిని మూటగట్టుకుంది. వైసీపీ దారుణంగా ఓడిపోవడంతో జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. దీంతో చంద్రబాబు మరోసారి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

Advertisement

Next Story