- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
AP News:‘స్వర్గీయ ఎన్టీఆర్ దేశానికే ఆదర్శనీయులు’.. మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు

దిశ, పాలకొల్లు: టీడీపీ స్థాపించిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి తీసుకు వచ్చిన స్వర్గీయ నందమూరి తారక రామారావు దేశానికే ఆదర్శనీయులు అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శనివారం స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ జెండాను మంత్రి రామానాయుడు ఆవిష్కరించారు. ప్రభుత్వం హాస్పిటల్లో రోగులకు, సిబ్బందికి పండ్లు, రొట్టెలు, పాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు జాతికి సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ ఎంత పెద్ద పండుగలో అదే స్థాయిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు రాష్ట్రంతో పాటు మన తెలుగువారు ఉన్నచోట కూడా ఘనంగా జరుగుతున్నాయని అన్నారు.
నాడు ఎన్టీఆర్ అమలు జరిపిన సంక్షేమ పథకాలు నేడు ప్రపంచమంతా ఆదర్శంగా నిలిచాయని, నిరుపేదలు ఆర్థికంగా ఎదిగి సమాజంలో గౌరవంగా జీవించే అవకాశం కలిగిందని అన్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు ఏర్పాటు చేసి చైర్మన్గా వ్యవహరించిన అన్నఎన్టీఆర్ దేశానికే ఆదర్శనీయులు అయ్యారని అన్నారు. ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు, సంస్కరణలతో మంచి ప్రజా పాలన సాగిస్తున్నారని అన్నారు. చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచిపోయేలా అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చంద్రబాబు కల్పించనున్నారని అన్నారు.
రెండు రూపాయల కిలో బియ్యం, వెనుకబడిన తరగతులకు రాజకీయ రిజర్వేషన్లు,పక్క ఇండ్లు, పింఛన్లు, దీపం పథకం, డ్వాక్రా సంఘాలు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, తదితర పథకాలు కల్పించిన ఘనత టిడిపి దేనని అన్నారు. విజన్ 2020 పెడితే ఆ రోజు ప్రతిపక్షం హేళన చేశారని సైబరాబాదును సాఫ్టువేరు రంగం ద్వారా పక్క రాష్ట్రాలకు వెళ్ళనవసరం లేకుండా యువతి, యువకులు వేలాదిమంది ఉద్యోగ అవకాశాలు పొంది లక్షలాది రూపాయలు జీతం పొందుతున్నారని అన్నారు.
దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని కోటి సభ్యత్వం తో పాటు బీమా పథకం వర్తింపచేస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారానే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, రాష్ట్ర యువతీ యువకుల భవిష్యత్తు కోసం నిరంతరం ఆలోచనలు చేసే వ్యక్తి అన్నారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో పేదలు బడుగు బలహీన అట్టడుగు వర్గాల సంక్షేమ పథకాలకు నాంది పలికిన ప్రజా పార్టీ అన్నారు. చంద్రబాబు ఆనాడు 2020 విజన్ తో ప్రగతి సాధించారని, నేడు 2047 విజన్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని మంత్రి రామానాయుడు అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు అంగర రామ్మోహన్,హాస్పిటల్ సూపర్డెంటు డా.ఓ రవికుమార్,వైద్యాధికారులు,నాయకులు గండేటి వెంకటేశ్వర రావు, పెచ్చేట్టి బాబు,ఉన్నమట్ల కబర్థి,కోడి విజయభాస్కర్, జక్కంపూడి కుమార్,కర్నేని రోజారమణి, కర్నేని గౌరునాయుడు, మామిడిశెట్టి పెద్దిరాజు, పాలవలస తులసీరావు, ధనాని సూర్యప్రకాష్,బందెల భాస్కరరావు,పాముల రజినీకుమార్,షేక్ శిలార్, సల్మాన్ భాజీ, మల్లంపల్లి పకీరుబాబు,వట్టం గణేష్, బోనం నాని,చినమిల్లి గణపతిరావు,అందే కోటివీరభద్రం,పీతల శ్రీనివాసు,హాస్పిటల్ సిబ్బంది, రోగులు వారి బంధువులు, టిడిపి,బిజెపి,జనసేన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.