Breaking: ఏలూరులో ఘోరం.. వాగులో పడిన టాటాఏస్.. నలుగురు చిన్నారుల మృతి

by srinivas |
Breaking: ఏలూరులో ఘోరం.. వాగులో పడిన టాటాఏస్.. నలుగురు చిన్నారుల మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కునూరు మండలం వేలేరు బ్రిడ్జిపై నుంచి టాటాఏస్ వాహనం వాగులో పడింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందగా 16 మందికి గాయాలయ్యాయి. వీరిని బూర్గంపాడు ఆస్పత్రికి తరలించారు. భద్రాచలం వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నలుగురు చిన్నారుల మృతదేహాలను వాగులో నుంచి బయటకు తీశారు. పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదంలో నలుగురు చిన్నారులు చనిపోవడంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.



Next Story