ఆందోళన పడుతున్న విద్యార్థిని.. పరీక్షా కేంద్రానికి చేర్చిన పోలీసులు

by srinivas |
ఆందోళన పడుతున్న విద్యార్థిని.. పరీక్షా కేంద్రానికి చేర్చిన పోలీసులు
X

దిశ, ఉత్తరాంధ్ర: విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీసు స్టేషను పరిధిలో పరీక్షా కేంద్రం చిరునామా తెలియక ఇబ్బంది పడుతున్న విద్యార్థినిని పట్ల పోలీసులు ఉదారతను చాటుకున్నారు. 10వ తరగతి పరీక్ష కేంద్రం చిరునామా తెలియక కంగారు పడుతున్న విద్యార్థినిని నెల్లిమర్ల ఎస్ఐ పి.నారాయణరావు సకాలంలో పరీక్ష కేంద్రానికి ప్రభుత్వ వాహనంలో చేర్చారు. దీంతో ఆయన అందరి మన్ననలు పొందారు. ప్రభుత్వ శాఖల అధికారుల సేవలు, సమాజంలో పోలీస్ వంటి కీలకమై శాఖల సేవలు పౌరులకు నిరంతరం ఇదే తరహాలో అందించాలని కోరుతూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు

Advertisement

Next Story

Most Viewed