Three killed : విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:24 Dec 2024 6:56 AM  )
Three killed : విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో విద్యుత్ స్తంభాన్ని(Electric Pole) కారు ఢీ కొన్న ఘటన(Road Accident)లో ముగ్గురు దుర్మరణం(Three killed)చెందారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం(Kanchili Mandal)జకర సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా... మరో ఇద్దరి పరిస్థితి(Two Injured) విషమం ఉంది. ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

కారులోని ప్రయాణికులు విశాఖపట్నం సీతమ్మధార నుంచి ఒడిశాలోని జాజిపూర్ అమ్మవారి దర్శనానికి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed