- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎన్నికలపై జనసేన ఫోకస్.. యూఎస్ ప్రవాసాంధ్రులకు కీలక ఆదేశాలు

దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికలపై జనసేన పార్టీ ఫోకస్ చేసింది. ప్రవాసాంధ్రులను సైతం భాగస్వామ్యులను చేయాలని ప్రయత్నింస్తోంది. ఈ బాధ్యతలను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తీసుకున్నారు. యూఎస్లో ఉంటున్న ప్రవాసాంధ్రులతో టెలికాన్ఫరెన్స్మ నిర్వహించారు. వచ్చే ఎన్నికలపై వారికి దిశానిర్దేశం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి జనసేన చాలా కీలకమని నాగబాబు చెప్పారు. ప్రవాసాంధ్రులంతా పార్టీ గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. అవకాశం ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ జనసైనికుడు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని తమ నియోజకవర్గాల పరిధిలో జనసేన గెలుపు కోసం అండగా నిలవాలని కోరారు. తటస్ట ఓటర్లను జనసేన వైపు ఆకర్షించాలని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, భావ జాలాన్ని, పవన్ నిర్ణయాలను సామాన్యులకు అర్ధమయ్యేలా వివరించాలని సూచించారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన రాజోలు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకుని పని చేయాలని చెప్పారు. ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నవారు తప్పకుండా స్వదేశం వచ్చి పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి రావడానికి అవకాశం లేని వారు అక్కడి నుంచే పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలని తెలిపారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న జనసైనికులను సమాయత్తం చేసేందుకు త్వరలో యూఎస్లో పర్యటిస్తానని నాగబాబు స్పష్టం చేశారు.
జనసేన గెలుపులో ప్రవాసుల పాత్ర కీలకం
— JanaSena Party (@JanaSenaParty) January 22, 2024
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయండి
యూఎస్ జన సైనికులతో టెలికాన్ఫరెన్స్ లో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారు pic.twitter.com/zWHnq0dRfy