TDP: ఇకనుంచి ఆంధ్రప్రదేశ్‌కి మంచి రోజులు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2025-01-17 12:10:08.0  )
TDP: ఇకనుంచి ఆంధ్రప్రదేశ్‌కి మంచి రోజులు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని, ఆంధ్రప్రదేశ్‌కి మంచి రోజులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel plant) పునరుద్దరణకు కేంద్రం నిధులు ప్రకటించింది. దీనిపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ఈ రోజు చరిత్రలో ఉక్కుతో చెక్కబడిన ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తుందని అన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం(NDA Government) ఏర్పడినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రతిస్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు రూ.11,440 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi)కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఉక్కు కర్మాగారానికి ప్రధాని అచంచలమైన మద్దతు కోసం తాను హామీ ఇస్తున్నానని, వికసిత్ భారత్- వికసిత్ ఆంధ్రలో(Viksit Bharath- Viksit Andhra) భాగంగా దేశ నిర్మాణానికి సంబంధించి ఇది దోహదపడుతుందని స్పష్టం చేశారు. అలాగే ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్(Union Minister Nirmala Sitharaman), కేంద్ర ఉక్కు శాఖమంత్రి హెచ్‌డీ కుమారస్వామి(Union MInister HD Kumara Swamy) లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేవలం కర్మాగారం మాత్రమే కాదని, ఇది అందరి హృదయాలలో ఆంధ్రప్రదేశ్ ప్రజల పోరాటాలు, స్ఫూర్తికి స్మారక చిహ్నంగా నిలుస్తుందని, ముఖ్యంగా వైజాగ్ ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని చెప్పారు. ఇది కేవలం ఎన్నికల వాగ్దానం కాదని, ఇది మేము గౌరవించాలని నిశ్చయించుకున్న వ్యక్తిగత నిబద్ధత అంటూ.. ఆంధ్రప్రదేశ్‌కి మంచి రోజులు రానున్నాయని చంద్రబాబు రాసుకొచ్చారు.

Next Story

Most Viewed