అంత ఇస్తాం.. ఇంత ఇస్తాం.. ప్రచారం చెయ్యండి అంటున్నారు.. ఎలక్షన్లపై స్టార్ యాంకర్ షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 7 |
అంత ఇస్తాం.. ఇంత ఇస్తాం.. ప్రచారం చెయ్యండి అంటున్నారు.. ఎలక్షన్లపై స్టార్ యాంకర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎలక్షన్ల వేడి రాజుకుంది. అధికారపార్టీలు, ప్రతిపక్షాలు ప్రచారాల్లో బిజీ అయిపోయారు. ఈ క్రమంలోనే బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా ఈ ప్రచారాల్లో నటులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇక ఏపీలో పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ఇప్పటికే చాలా మంది రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇక బుల్లితెర యాంకర్ శ్యామల కూడా వైసీపీ తరుపున తన ప్రచారాల్లో గొంతు వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ ఇష్యూ హాట్ టాపిక్ అవుతుండగా.. ఇలాంటి సమయంలో స్టార్ యాంకర్ రవి ఏపీ ఎన్నికలకు సంబంధించి చేసిన కామెంట్స్ హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి.

ఈ మేరకు రవి హోస్ట్ చేస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టీవీ షో 600 ఎపిసోడ్‌లను కంప్లీట్ చేసుకోవడంతో మీడియాలతో మాట్లాడాడు రవి. ‘నిజంగా చెప్తున్న నాకు పాలిటిక్స్‌పై అసలు అవగాహన లేదు. ఇప్పుడు యాంకర్లు, ఆర్టిస్ట్‌లు ప్రాచారాల్లో పాల్గొంటూ మాట్లాడుతున్నారంటే.. లీడర్ల గురించి తెలుసుకున్నారు, మాట్లాడుతున్నారు. నన్ను అడిగితే.. పాలిటిక్స్ విషయంలో తెలిసి మాట్లాడితే మంచిది. ఇక నన్ను కూడా ఎలక్షన్స్‌లో ప్రచారం చేయమని చాలామంది అడిగారు. తెలంగాణ ఎన్నికల టైంలో కూడా అంత ఇస్తాం ఇంత ఇస్తాం అంటూ ప్రచారం చెయ్యమన్నారు. కానీ నాకు పాలిటిక్స్ పెద్దగా తెలియదు కాబట్టి అదే చెప్పా’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం యాంకర్ రవి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story