Ap Politics:సుపరిపాలన అందించడమే NDA కూటమి అజెండా: కూటమి అభ్యర్థి

by Disha Web Desk 18 |
Ap Politics:సుపరిపాలన అందించడమే NDA కూటమి అజెండా: కూటమి అభ్యర్థి
X

దిశ ప్రతినిధి,ధర్మవరం: అరాచక పాలనలో ప్రజలు విసుగు చెందారని, సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో అన్ని వర్గాలకు సముచితంగా సంక్షేమ పథకాలు అందించడానికి మేనిఫెస్టో సిద్ధం చేశామని ధర్మవరం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం ముదిగుబ్బ మండలంలో ఎన్‌డిఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం చేశారు. భవిష్యత్తులో అమలు చేసే సంక్షేమ పథకాలను వివరిస్తూ... కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

స్థానిక ఎమ్మెల్యే గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆరోపించారు. కనీసం తాగునీటి వసతి కల్పించకపోవడంతో ప్రజలు నీటి కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అన్నింటినీ పరిష్కారం చేస్తానని భరోసా ఇచ్చారు. ఆయన తరఫున ప్రచారం చేయడానికి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి వచ్చి ప్రచారం చేశారు. తప్పకుండా కమలం గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆదినారాయణ యాదవ్, పారిశ్రామికవేత్త గడ్డం రాజగోపాల్, తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed