మండుటెండల్లో ఏపీ వాసులకు గుడ్ న్యూస్

by Disha Web Desk 16 |
మండుటెండల్లో ఏపీ వాసులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: మండుటెండల్లో ఏపీ వాసులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడిపోతున్న జనాలకు చల్లని కబురు వచ్చింది. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరో రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మూడు రోజులు పాటు చిత్తూరు, పల్నాడు, అనకాపల్లి, విశాక, శ్రీకాకుళం , విజయనగరం, మన్యం జిల్లాల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాయలసీమలోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Read More..

రాష్ట్ర ప్రజలకు చల్లని వార్త.. మూడు రోజుల్లో భారీ భార్షాలు

Next Story

Most Viewed