పవన్ కళ్యాణ్ తో కిలారి రోశయ్య భేటీ

by M.Rajitha |
పవన్ కళ్యాణ్ తో కిలారి రోశయ్య భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ(YCP) మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య(Kilari Roshaiah) నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan kalyan) తో భేటీ అయ్యారు. శనివారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిసి పుష్పగుచ్చం అందించారు రోశయ్య. ఈ సమావేశం అనంతరం రోశయ్య, ఆయన వియ్యంకుడు రవిశంకర్ జనసేన పార్టీలో చేరుతున్నట్లు జనసేన పార్టీ వర్గాలు ప్రకటించాయి. కాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ స్థానం నుండి పోటీ చేసిన రోశయ్య పరాజయం పాలయ్యారు. వైసీపీ పార్టీ విధానాలు నచ్చకే పార్టీ వీడుతున్నట్టు రాజీనామా చేసిన రోజు ఆయన పేర్కొన్నారు. అయితే జనసేనలో చేరేందుకే వైసీపీని వీడినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. కాగా జనసేపార్టీలో రోశయ్య చేరిక ఖాయమని నేడు అధికారికంగా వెల్లడైంది.

Next Story

Most Viewed