- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జీబీ సిండ్రోమ్.. ఇంజక్షన్ చాలా ఖరీదే!

దిశ, డైనమిక్ బ్యూరో : గులేరియా బాలి సిండ్రోమ్.. ఇది ఇప్పుడు తెలుగు రాష్ర్టాలను వణికిస్తోంది.ఈ వ్యాధి బారిన పడి ఇప్పటికి ఏపీలో ఇద్దరు మృతి చెందారు. జీజీహెచ్లలో పలువురు చికిత్స పొందుతున్నారు. అయితే ఈ వ్యాధి సోకిన వారికి ఇంట్రా వీనస్ఇమ్యునో గ్లోబిన్అనే ఇంజక్షన్వాడతారు. అది చాలా ఖరీదైనది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశం అనంతరం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆ వివరాలను వెల్లడించారు. ఈ ఇంక్షన్ ఒక్కొక్కటి రూ.20 వేలు ఉంటుందన్నారు. ఒక పేషెంట్కు రోజుకు ఐదు ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇలా ఐదురోజులు ఇంజక్షన్ వాడాలి. అంటే రోజుకు లక్ష .. ఐదురోజులకు ఐదు లక్షల రూపాలు ఖరీదు చేసే ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులు వస్తున్నారని తెలిపారు. దీనిని ఎన్టీఆర్ వైద్యసేవలో కూడా చేర్చామన్నారు. జీజీహెచ్లలో 740 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గోడౌన్లలో 429 ఇంజక్షన్లు నిల్వ ఉన్నాయని తెలిపారు.