- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బీజేపీలోకి చిరంజీవి.. స్పందించిన మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) బీజేపీ(Bjp)లో చేరబోతున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy)తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవికి ప్రధాని మోడీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాదు ప్రధాని మోడీ(Pm Modi)తో పాటుగా సమానంగా చిరంజీవి కలిసి నడిచారు. దీంతో చిరంజీవి కాషాయతీర్థం పుచ్చుకోబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై చిరంజీవి గానీ, కిషన్ రెడ్డి గాని స్పందించలేదు. దీంతో ఈ ప్రచారానికి మరింత బలం పెరిగింది. బీజేపీ వైపు మెగాస్టార్ అడుగులు పడతాయనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా మారింది.
ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్(Bjp former Mp TG Venkatesh) స్పందించారు. బీజేపీ, చిరంజీవి స్నేహ పూర్వక సంబంధాలున్నాయని తెలిపారు. తదుపరి విషయాలు తనకు తెలియవని చెప్పారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఈ ఏడు నెలలపాటు అద్భుతంగా పాలన చేసిందన్నారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ గతంలోనే వచ్చేదని, కొంత మంది న్యాయవాదులు ఆందోళన చేయడం వల్ల ఆగిపోయిందని తెలిపారు. హైకమాండ్ నిర్ణయంతోనే రాష్ట్రంలో అధ్యక్షుల పదవులు మారుతూ ఉంటాయని టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు.