Rajahmundry: స్నేహితుడి ప్రాణం తీసిన 'కులం'

by Y.Nagarani |
Rajahmundry: స్నేహితుడి ప్రాణం తీసిన కులం
X

దిశ, వెబ్ డెస్క్: కులం కారణంగా ఒక వ్యక్తి ప్రాణం పోయింది. తమను కులం పేరుతో దూషించిన స్నేహితుడిని.. తోటి స్నేహితులే అంతమొందించారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత నెల 27న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన దొడ్డి రాజా అర్జున్(50) కు భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.

రాజా అర్జున్ తన ఇద్దరు స్నేహితులు వెంకటేష్, పుష్పరాజ్ లతో కలిసి లోతు గడ్డ జంక్షన్ కు వెళ్లారు. అక్కడ ముగ్గురూ మద్యం సేవించారు. అంతా బాగానే ఉంది. కానీ.. పుష్పరాజ్ ను అర్జున్ కులంపేరుతో దూషించడంతో.. ముగ్గురి మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఈ క్రమంలో అర్జున్ ను.. వెంకటేష్, పుష్పరాజ్ లు చింతలూరు సమీపంలో ఉన్న తోటలోకి తీసుకెళ్లారు. ఇద్దరూ కలిసి అర్జున్ ను రాయితో కొట్టి చంపి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

వ్యక్తి మరణంపై స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అర్జున్ తో పాటు వెళ్లిన ఇద్దరిపై అనుమానం వచ్చిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed