మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే బ్రాండ్లు

by Jakkula Mamatha |   ( Updated:2024-10-16 08:45:41.0  )
మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే బ్రాండ్లు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో నూతన మద్యం విధానం నేటి నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. మొదటి రోజే పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చినట్లు మంత్రి వర్గాలు తెలిపాయి. అసలు విషయంలోకి వెళితే.. ఏపీలో కొత్త లిక్కర్ షాపులు ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో మద్యం ప్రియులకు ప్రభుత్వం కిక్కిచ్చే న్యూస్ చెప్పింది. 2019కి ముందు ఉన్న మద్యం బ్రాండ్లు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. కింగ్ ఫిషర్, రాయల్ స్టాగ్, మాన్షన్ హౌస్, ఇంపీరియల్ బ్లూ లాంటి బ్రాండ్లను చూసి మందుబాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మద్యం దుకాణాల్లో నగదుతో పాటు డిజిటల్ పేమెంట్లను స్వీకరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డిజిటల్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి. జూన్ నుంచి ప్రతి నెలా 9 శాతం పెరిగాయి. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న లిక్కర్ షాపులు ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు.

Advertisement

Next Story